![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో.. రింగ్ ఎక్కడ పోయిందని సీతాకాంత్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన క్యాబ్ లో రామలక్ష్మికి రింగ్ కనిపిస్తుంది. అది పట్టుకొని ఇంట్లో వచ్చి ఈ రింగ్ ఎవరిదని ఆలోచిస్తుంది. ఆ రింగ్ చూసి రామలక్ష్మి వాళ్ళ అమ్మ బంగారo ఉంగరమా అని అడుగుతుంది. లేదు రోల్డ్ గోల్డ్ లాగా ఉందని అని ధన అంటాడు.
ఆ తర్వాత ఆ రింగ్ ఇవ్వు అని పింకీ తీసుకొని.. నెట్ లో సెర్చ్ చేసి చూస్తుంది. ఆ రింగ్ డీటెయిల్స్ చూసి పింకీ షాక్ అవుతుంది. ఏమైంది అంటూ రామలక్ష్మి వాళ్ళు అడుగుతారు. ఇది బంగారo కాదు డైమండ్ రింగ్ అనగానే అందరు షాక్ అవుతారు. దీని కాస్ట్ యాభై లక్షలు అనగానే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత డోర్లు వేసి ఆ రింగ్ ని చూస్తుంటారు. అప్పుడే మాణిక్యం వచ్చి డోర్ కొడుతాడు. నాన్న గానీ ఈ రింగ్ చూస్తే ఇక అంతే సంగతులని ధన అంటాడు. అందరు ఎప్పటిలాగే ఉందామని అనుకుని డోర్ తీస్తారు. ఇప్పుడే తాగి వచ్చిన తిట్లతో స్వాగతం పలికే తన భార్య నవ్వుతు లోపలికి రమ్మనడం చూసి మాణిక్యం షాక్ అవుతాడు. అందరు రోజులాగా కాకుండా డిఫరెంట్ బెహేవ్ చేసేసరికి.. ఏం జరిగిందని మాణిక్యం అడుగుతాడు. ఏం లేదని అనగానే వెళ్లి మాణిక్యం పడుకుంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ అమ్మాకి రింగ్ ఎక్కడో పడిపోయిందని చెప్తాడు. అది విని శ్రీవల్లి గొడవ చెయ్యాలని ట్రై చేస్తుంది కానీ తన అత్తయ్యకి బయపడి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రింగ్ చూస్తూ రామలక్ష్మి ఫ్యామిలీ ఉంటుంది. రింగ్ ఏమైందని సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటు రామలక్ష్మి క్యాబ్ లో పడేసుకున్నాన అని ఆలోచించుకుని తనకి ఫోన్ చేస్తాడు. ఎక్కడ మాణిక్యం లేస్తాడో అని రామలక్ష్మి సీతాకాంత్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత రింగ్ చేతులో ఉండగానే అందరు పడుకుంటారు. మాణిక్యం నిద్రలేచి రింగ్ తీసుకోగానే అందరు లేస్తారు... ఆ రింగ్ యాభై లక్షలు విలువైనదని తెలుసుకున్న మాణిక్యం అది అమ్మి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. వద్దు నాన్న అది వాళ్ళది.. వాళ్ళకి ఇచ్చేయాలని రామలక్ష్మి అన్న కూడా మాణిక్యం పట్టించుకోడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ వాళ్ళ అమ్మకి రింగ్ దొరికిందని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో
![]() |
![]() |